నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు ఆదివారం (28-06-2026 వ తేదీన) న్యాయమూర్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. హైకోర్టు జడ్జిలు మహేశ్వర రావ్, మరియు T.C.D. శేఖర్, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి,N.జయసూర్య,జిల్లా జడ్జిశ్రీమతి అరుణ చారుక బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనార్ధము విచ్చేసినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారికి అమ్మవారి దర్శనము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.
Reporter
Namitha News