నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 31 : డెహ్రాడూన్ లో జరిగిన పెన్కాక్ సిలాట్ యుద్ధ కళ పోటీలలో ఆత్మకూరుకు చెందిన 9వ తరగతి చదివే షేక్ మొహమ్మద్ హనీఫ్ అనే విద్యార్థి సిల్వర్ పథకం సాధించారు. గత నెలలో శ్రీకాకుళంలో జరిగిన పోటీలలో గెలుపొంది డెహ్రాడూన్ పోటీలకు ఎంపికైన ఈ విద్యార్థి నేడు జరిగిన పోటీలో ఐదు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి గెలుపొంది సిల్వర్ పథకం సాధించాడు. ఆత్మకూరు పట్టణంలోని ఏ సి ఎస్ ఆర్ కాలనీకి చెందిన షేక్ అహ్మద్ భాషా కుమారుడైన మహమ్మద్ హనీఫ్ పట్టణంలోని శ్రీనివాస పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఆట పట్ల బాలుడికి ఉన్న ఆసక్తితో ఎంతో వ్యయ ప్రయాసలుపడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు వెళ్లి అక్కడ జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని సిల్వర్ పతకం సాధించడం నిజంగా గర్వించదగ్గ విషయం
Admin
Namitha News