Wednesday, 29 July 2026 08:17:39 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు

Date : 19 June 2026 10:17 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : తంబళ్లపల్లె మండలంలో గతంలో జరిగిన జె ఎస్, జే బీ లో చేపట్టిన ఉపాధి పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అనిల్ ప్రశంసించారు. గత రెండు రోజులుగా అనిల్, డ్వామా జేఈ నాగరాజులు మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, జుంజురపెంట, గోపిదిన్ని, గుండ్లపల్లి, దిగువపాలెం, గంగిరెడ్డిపల్లి, తంబళ్లపల్లె, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి, ఎద్దులవారిపల్లి పంచాయతీలలో చేపట్టిన 90 జె ఎస్, జేబీ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ లో చేపట్టిన ఉపాధి పనులు ట్రెంచీలు, ఫారం పాండ్స్, మొక్కలు పెంపకం పనులను అక్షాంశ, రేఖాంశ ల ద్వారా ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. మండలంలో చేపట్టిన పనులు ఎక్కడ పారదర్శకత లోపం కానురాక పోవడం విశేషం. ఈ సందర్భంగా సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అరుణ్ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన 90 పనులను తనిఖీ చేశామని సక్రమంగా ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో 1211 జె ఎస్, జేబీ పనుల కు గాను 234 పనులను తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. మిగతా పనులను సైతం త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వారి వెంట ఏపిఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, క్షేత్ర సహాయకులు నరసింహులు, రమేష్, గోబ్రే నాయక్, రాణి, అశోక్, చాంద్ భాషా, వేమ నారాయణ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :