Thursday, 30 July 2026 01:32:41 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాల పై ఉపన్యాసం

Date : 09 January 2026 08:45 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాలు” అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ పూర్వ విద్యార్థి దేవరావుల శివమణి పాల్గొని, ప్రముఖ సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సంస్థలయిన రేవచర్, సుమెరు డిజిటల్ సొల్యూషన్స్, హెచ్.సి.ఎల్‌ సంస్థల్లో ఎంపికై ఉద్యోగాలు సాధించిన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ రంగాలలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. పైథాన్, జావా, ఫుల్ స్టాక్, వి.ఎల్.ఎస్.ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎస్‌క్యూఎల్ వంటి కోర్సులపై నైపుణ్యం సాధిస్తే మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందడం సాధ్యమని సూచించారు. చదువుతో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అల్యూమ్ని రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత మాట్లాడుతూ శివమణి లాంటి పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల ప్రస్తుత విద్యార్థులకు స్పష్టమైన కెరీర్ దిశ లభిస్తుందని, మిట్స్ యాజమాన్యం విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ విభాగ అధ్యాపకులు, కోఆర్డినేటర్ జి. చరణ్ కుమార్, శివమణి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :