నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ - మే 02 : న్యాయ కోవిదుడుగా, రాజకీయ, ప్రజా సేవకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుండిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి దశదిన కర్మ కార్యక్రమం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగింది. కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారితో ఉన్న పరిచయాలు, స్మృతులను గుర్తు చేసుకున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి, మానవతా వాదిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. శ్రీ భాస్కరరావు గారి కుమారుడు ఏపీ ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని పార్టీల నుంచి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకు నివాళులర్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు, అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీమతి అనిత, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ సత్య కుమార్ యాదవ్, శ్రీ టీజీ భరత్, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు శ్రీ పుట్టా మహేష్, శ్రీ కేశినేని శివనాథ్, శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శ్రీ సాన సతీష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శ్రీ కూన రవికుమార్, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ సుజనా చౌదరి, శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ సుందరపు విజయ్, శ్రీమతి లోకం నాగ మాధవి, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ బత్తుల బలరామ కృష్ణ, శ్రీ పంతం నానాజీ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ అరవ శ్రీధర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, మాజీ ఎంపీ శ్రీ టి సుబ్బరామిరెడ్డి, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీ ఐడీసీ చైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోట సుధీర్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా.హరిప్రసాద్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ షేక్ రియాజ్, అహుడా చైర్మన్ శ్రీ టి సి వరుణ్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, శ్రీ టీజీ వేంకటేష్, సిపిఐ నాయకుడు శ్రీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ శ్రీ మహేష్ చంద్ర లడ్డా, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ గోపీనాథ్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీ కన్నబాబు, శ్రీమతి సృజన, సినీ పరిశ్రమ నుంచి శ్రీ అల్లు అరవింద్, శ్రీ విశ్వ ప్రసాద్, శ్రీ తనీష్, శ్రీ ఆర్కే నాయుడు, శ్రీ బన్నీ వాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి చినబాబు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్, జనసేన పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు నివాళులు అర్పించారు.
Reporter
Namitha News