నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్ టి ఈ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం “ప్లేస్మెంట్ ఎక్సలెన్స్ కోసం ముందస్తు ప్రణాళికా వ్యూహాలు” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన రాంపెక్స్ టెక్నాలజీస్, టెక్నికల్ ట్రైనర్-హెడ్ ఏ.ఎమ్ విగ్నేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్లేస్మెంట్ ప్రణాళికలు మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమే తయారీ విధానం, మాక్ ఇంటర్వ్యూల ప్రాధాన్యం, గ్రూప్ డిస్కషన్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఆన్లైన్ కోర్సులు మరియు సర్టిఫికేషన్ల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నెట్వర్కింగ్ ప్రాధాన్యం వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. క్రియేటివ్ గా ఆలోచించడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగడం, స్థిరంగా నిర్ణయాలపై నిలబడటం లాంటివి మన వ్యక్తిత్వాన్ని మరింత ధృడంగా మారుస్తాయి అని, సక్సెస్ ఎక్కువ కాలం నిలవడానికి ఇవి చాలా ముఖ్యం అని అన్నారు. వాస్తవ ప్రపంచ ప్లేస్మెంట్ వ్యూహాలు కెరీర్ విజయానికి కీలకమైనవి అని, విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, నైపుణ్య అభివృద్ధి మరియు విలువైన పరిశ్రమ సంబంధాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్. శ్రీ దేవి, అసిస్టెంట్-డీన్ డాక్టర్ కే.చంద్ర మోహన్, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్.సుధాకర్, డాక్టర్ జి అరుణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News