Monday, 08 June 2026 09:59:17 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి

Date : 12 January 2026 12:10 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాలు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి. అప్పలరాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం అపాలని కోరుతూ. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పి.డి. చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంంచిం. నిని గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీ.డీ. చట్టాన్ని రైతు నాయకుడు ఎం.అప్పలరాజు పై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా సక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్య కారకంగా మారుతుం, మత్స్య సంపద దెబ్బతింటుంది. మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెప్పుతున్న, దానికి విరుద్ధంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవదాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. వారికి అండగా ఉన్నాడన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజు పై ప్రభుత్వం పి.డి. చట్టాన్ని ప్రయోగించిం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బందాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది ఏ మాత్రం సరైనది కాదు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడి చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తున్నది. ఈ రకమైన నిరంకుశ వైఖరిని మానుకోవాలని కోరుచున్నాము. తక్షణమే అప్పలరాజు పై పెట్టిన పీ.డీ, చట్టాన్ని రద్దు చేయాలని, జైలు నుండి విడుదల చేయాలని కోరుచున్నాము. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో 1/70 చట్టానికి భిన్నంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములలో వేసిన మొక్కజొన్న ఇతర పంటలను బుట్టాయిగూడెం తాసిల్దార్, ఎస్పై, పోలీసులు కలసి ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సైని ప్రశ్నించిన గిరిజనుల పైన ఎస్సై బౌతికంగా దాడి చేశాడు. మహిళలు అని చూడకుండా మగ పోలీసులే మహిళలను జాకెట్లు చింపి చేయి పట్టుకుని పక్కకు లాగివేశారు. అడ్డువచ్చిన గిరిజన రైతును లాఠీతో కొడితే తల పగిలి రక్తగాయమైంది. ఈ ఘటనలో దౌర్జన్యం చేసిన పోలీసుల మీద, రెవెన్యూ అధికారుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా గిరిజనులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం లో విద్యార్ధి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ రకంగా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై పెట్టిన పి.డి. చట్టం, ఏలూరు జిల్లా ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు, విద్యార్థులపై పెట్టిన రౌడీషీట్ అన్నింటిని ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భందాన్ని ఆపాలని ప్రజాసంఘాల తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :