నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 20 ః అమరావతి నవనిర్మాత, 20 47 విజన్ ప్రధాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు తంబళ్లపల్లె మండల కేంద్రం ములకలచెరువు క్రాస్ రోడ్ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి సారథ్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, కొండ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో గోపి దిన్ని మాజీ సర్పంచ్ ఉత్తమరెడ్డి, కన్నె మడుగు సిద్ధారెడ్డి, పంచాలమర్రి సాంబశివారెడ్డి, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, నాయుడు, చింపిరి మల్ రెడ్డి, రఘుపతి, కుమార్ నాయుడు, మైనార్టీ నాయకులు భాష,ఏటిగడ్డ పల్లి రెడ్డప్ప, తుకారం, దళితవాడ రెడ్డప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News