నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మార్చి 16 : మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలం లోని తిరుమల రెడ్డి పల్లి లో చోటుచేసుకుంది. యస్.ఐ. తెలిపిన సమాచారం మేరకు పెద్దకురప్పల్లి పంచాయతీ పరిధి లోని తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆకుతోట సుధారాణి 29 సం" వివాహిత ఫోన్లో మాట్లాడుతుండగా భర్త వెంకటరమణ గమనించి ఫోన్ లాక్కొని మందలించడం తో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం లో గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు
Admin
Namitha News