Wednesday, 16 September 2026 12:54:36 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

నాటి ఉద్యమాల ఫలితంగానే మదనపల్లి జిల్లా సాకారం

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు

Date : 10 November 2025 11:05 AM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నాటి ఉద్యమాల ఫలితంగానే మదనపల్లి జిల్లా సాకారం - ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హర్షం మదనపల్లె : నాటి ఉద్యమాల ఫలితంగానే మదనపల్లి జిల్లా సాకారమైందని ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) స్పష్టం చేశారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.జిల్లాల పునర్విభజన కాకమునుపే మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తాము జిల్లా సాధనలో భాగస్వాములు కావడం జరిగిందన్నారు.అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జిల్లా సాధన సమితి నాయకులతో పాటు తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.తనపై ఏడు కేసులు పెట్టిందని ఆరోపించారు.అయినప్పటికీ తాము వెనక్కి తగ్గకుండా పోరాటాలు చేశామన్నారు.అయితే యువగళం పాదయాత్రలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్,ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసిందన్నారు.మంత్రివర్గ ఉప సంఘం మదనపల్లి జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు.త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లాపై అధికారిక ప్రకటన చేయనున్నారని,దీంతో దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరనున్నదని వెల్లడిం చారు.మదనపల్లి జిల్లా ఏర్పాటయితే పరిశ్రమలు ఏర్పాటై,ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని,వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు.నాడు మదనపల్లి జిల్లాపై వైసీపీ ప్రభుత్వం మాట తప్పితే,నేడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలుపుకుందని ప్రశంసించారు.అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాసనసభ సమావేశాల్లో మదనపల్లి జిల్లా ఆవశ్యకతపై గళం వినిపించారని కొనియాడారు.చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మదనపల్లి జిల్లా ఏర్పాటు కావడం సరికొత్త అధ్యాయమని,ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :