Sunday, 13 September 2026 11:00:24 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి

Date : 18 November 2025 05:02 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి - దుశ్చర్యకు ఒడిగట్టిన కొందరు స్థానికులు మదనపల్లె : గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యల నడుమ స్థానికంగా ఉన్న కొందరు మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతి,ఎగువకొనకుంట్ల వారిపల్లె గ్రామానికి దారి లేకుండా 20 రోజులుగా రోడ్డుకు అడ్డంగా మట్టితోలి దారిని పూర్తిగా మూసేశారు.దీంతో గ్రామంలోని 29 కుటుంబాలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా,విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా,రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలన్నా,వ్యవసాయ పొలాల నుంచి ధాన్యం,గడ్డి,వ్యవసాయ పనిముట్లు,తదితర వస్తువులు ఇళ్లకు,పొలాలకు తరలించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దారిని తెరవాలని అడిగితే స్థానికంగా గొడవలకు దిగి,దుర్భాషలాడుతూ,ఘర్షణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.వారిని ఎదిరించే శక్తి మాకు లేదని అధికారులకు,పోలీసులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిని మూసేసిన వారిపై చర్యలు తీసుకొని వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.ఈ విషయమై తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ,వీఆర్వోలను సంఘటనా స్థలానికి పరిశీలనకై పంపామని,అయినా వారు దారికి అడ్డుగా వేసిన మట్టిని‌ తొలగించలేదన్నారు.కాబట్టి వారిపై కేసు నమోదు చేయమని తాలూకా పోలీసులను కోరడం జరిగిందన్నారు.‌మూసేసిన దారిని వెంటనే తెరవకపోతే కఠిన‌ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: