నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 25: మదనపల్లి లో చోటు చేసుకున్న దారుణ సంఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు సచివాలయం లోని మంత్రి ఛాంబర్లో 24వ తేదీ మంగళవారం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను మంత్రి ఓదార్చి, ప్రభుత్వం వారి కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా కలెక్టర్తో మాట్లాడతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు
Admin
Namitha News