నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సైబర్ దాడులు మరియు సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్, దక్షిణ భారత అధ్యక్షుడు డాక్టర్ జయవర్మ ఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని అన్నారు. రీల్స్, షార్ట్స్, గేమ్స్ వంటి వాటిలో ఎక్కువ సమయం గడపడం వలన విలువైన సమయం వృథా అవుతుందని అన్నారు. అయితే మొబైల్ను సరైన విధంగా ఉపయోగిస్తే ప్రస్తుత వ్యవహారాలు, ఇంగ్లీష్ నైపుణ్యాలు, వ్యక్తిత్వాభివృద్ధి వంటి అంశాలలో ఉపయోగకరమైన అనేక యాప్స్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ లోన్ మోసాలు, ఫేక్ లింకులు, ఎస్ఎంఎస్లు, అనుమానాస్పద యాప్స్ ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి, స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు.విజయ లక్ష్మీ, అసిస్టెంట్ డీన్స్- ఫస్ట్ ఇయర్ బి.టెక్ డాక్టర్ కే.చంద్ర మోహన్, డాక్టర్ సుబ్బా రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News