Sunday, 13 September 2026 11:58:21 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులకు ఆరోగ్యం, సైబర్ దాడులు, సోషల్ మీడియా వినియోగం పై అవగాహన

Date : 02 March 2026 08:34 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సైబర్ దాడులు మరియు సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్, దక్షిణ భారత అధ్యక్షుడు డాక్టర్ జయవర్మ ఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని అన్నారు. రీల్స్, షార్ట్స్, గేమ్స్ వంటి వాటిలో ఎక్కువ సమయం గడపడం వలన విలువైన సమయం వృథా అవుతుందని అన్నారు. అయితే మొబైల్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే ప్రస్తుత వ్యవహారాలు, ఇంగ్లీష్ నైపుణ్యాలు, వ్యక్తిత్వాభివృద్ధి వంటి అంశాలలో ఉపయోగకరమైన అనేక యాప్స్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ లోన్ మోసాలు, ఫేక్ లింకులు, ఎస్‌ఎంఎస్‌లు, అనుమానాస్పద యాప్స్ ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి, స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు.విజయ లక్ష్మీ, అసిస్టెంట్ డీన్స్- ఫస్ట్ ఇయర్ బి.టెక్ డాక్టర్ కే.చంద్ర మోహన్, డాక్టర్ సుబ్బా రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :