నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 ః తంబళ్లపల్లె మండలంలో అధికారులు తమ శాఖల పనితీరుపై చొరవచూపి సమస్యల పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా పీడి వెంకటరత్నం సూచించారు. శనివారం ఆయన మండలంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ఏపీ డి నందకుమార్ రెడ్డితో కలిసి ఎర్రసాని పల్లెలో ప్రకృతి వ్యవసాయం పంట సాగును పరిశీలించి ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పెంచాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి ప్రతి జాబ్ కార్డు కలిగిన వ్యక్తికి పని కల్పించాలన్నారు. అనంతరం తంబళ్లపల్లె సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించి స్వామిత్వ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే పై ఆరా తీసి పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని హెచ్చరించారు. అనంతరం మల్లయ్య కొండ కింద పండ్ల తోటల ప్లాంటేషన్, కరువు పనులు పరిశీలించారు. అనంతరం మల్లయ్య కొండ శివాలయంలో మహా శివుని దర్శించి పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటరమణ, పద్మావతి, భాస్కర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News