Monday, 14 September 2026 11:45:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీవారి లడ్డూను కల్తీ చెసిన పాపం వైకాపా నాయకులదే - మై ఫోర్స్ మహేష్

Date : 04 February 2026 08:04 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం వైకాపా నాయకులదేనని జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డులో 58లక్షల లీటర్ల పామాయిల్, రెండు లక్షల లీటర్ల సింథటిక్ కెమికల్ (జంతువుల కొవ్వు) కలిపారని ఇక నెయ్యి లేదని తెలిపారు.1-16- 2024 లో ఒకసారి 23-7-2024లో మరోసారి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ 35 వపేజీలో లడ్డు ప్రసాదంలోజంతువుల కొవ్వు కలిసినట్లు ఉందన్నారు. లడ్డు ప్రసాదంలో చేసిన రిపోర్టులన్నీ సింథటిక్ కెమికల్స్ వాడినట్లు వచ్చాయని నేడు వైకాపా నాయకులు చేసిన పనికి సిగ్గుపడక ఆ నింద జనసేన, టిడిపి , బిజెపి నాయకుల పై మోపి శ్రీరంగనీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైకాపా నాయకులకు పుట్టగతులు ఉండవని హిందూ భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం అపవిత్రం చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన వైకాపా నాయకులు పార్టీ కావాలో శ్రీవారు కావాలో తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని దెబ్బతీయాలనే వైకాపా కపట నాటకాలు చెల్లవని హిందువుల మనోభావాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో వైకాపా కనుమరుగు కావడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె జనసేన నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో చేసిన కల్తీని వైకాపా నాయకులు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్, కూటమి పై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉమేష్, రఘు, సురేష్, అరవింద్, రెడ్డప్ప, కార్తీక్, రెడ్డి ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: