నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 25 : తంబళ్లపల్లె మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా చేస్తున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ డిఇ మునిరాజ్ సూచించారు. బుధవారం ఆయన మండలంలోని తంబళ్లపల్లె, ఎద్దుల వారి పల్లి పంచాయతీలలో జరుగుతున్న సిసి రోడ్లు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 20 47 లో భాగంగా చేస్తున్న పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలని అదేవిధంగా ప్రజలకు సౌకర్యవంతంగా పనులు చేపట్టాలని ఏఈ వెంకటరమణ కు సూచించారు. అనంతరం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్ కాలనీ, మసీదు వీధి, శ్రీనివాస కాలనీ సిసి రోడ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News