Wednesday, 29 July 2026 11:05:42 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సిపిఐ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక

జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డి

Date : 02 December 2025 05:16 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక - జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డి నియామకం - ప్రకటించిన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక చేయడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య ప్రకటించారు. మంగళ వారం స్థానిక అనప గుట్ట నందు కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సమావేశం రమణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య అన్నమయ్య జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డిని, కొ కన్వినర్ గా హరి ని నియమించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం వారి నుండి పార్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయల సీమ కు ప్రత్యేక ప్యాకేజి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ అభివృద్ధి కోసం కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కళాశాల లను పిపిపి పద్దతిలో కాకుండా, ప్రజల ఆరోగ్య బద్రత, వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వమే కొన సాగించాలని డిమాండ్ చేశారు. ఆసియా లో అతి పెద్ద టమోటా మార్కెట్ లో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం కోసం కోల్డ్ స్టోరేజిలు, పుల్ప్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయా లన్నారు. జిల్లా కన్వీనర్ రమణా రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువను పూర్తి స్థాయిలో తంబళ్ళ పల్లె, మదనపల్లె నియోజక వర్గాల్లో అను సంధానం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతుల సాగునీటి సమస్య కి పరిష్కారం లభి స్తుందన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అలాగే అన్నమయ్య జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి రైతులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన చెప్పటాలన్నారు. రాయల సీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కో కన్వీనర్ హరి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కష్టపడి పంటలు పండిస్తున్న వారికి సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతాంగం పై ప్రత్యేక శ్రద్ధను పెట్టి గిట్టుబాటు ధరలతో పాటు, ఉచిత పంటల బీమాను అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :