నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 02 : రాష్ట్రంలో నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన దార్శనికుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైకాపా సీనియర్ నాయకుడు (రియాల్టర్) నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి కొనియాడారు. బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆదేశాల మేరకు మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో తంబళ్లపల్లె వైఎస్సార్ సర్కిల్లో వైయస్సార్ వర్ధంతిని నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూజలు నిర్వహించి వైయస్సార్ అమర్ రహే, జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి అని నాగాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో చిరస్మరణీయుడయ్యాడని ఆయన తనయుడు నేటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెట్టింపు అభివృద్ధితో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని కొనియాడారు. నల్లగుండ్ల మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News