Monday, 08 June 2026 08:19:59 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు

పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Date : 21 May 2026 04:07 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ : సేవే లక్ష్యంగా పనిచేస్తున్న స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, ధాత్రి ఫౌండేషన్ సంస్థలు పలమనేరులో 30 మంది గిరిజనులు, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశాయి. పలమనేరు పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి అవకాశాలు లేక జీవనం కష్టతరంగా మారుతోందన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూలీ పనులు కూడా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సరుకులు రెండు నెలల పాటు ఉపయోగపడతాయని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి తిరుపతి నుంచి స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, మదనపల్లి నుంచి ధాత్రి ఫౌండేషన్ వచ్చి సహాయం అందించడం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. పలమనేరు మండలంలో ఈ సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ బృందం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి, శ్రీమతి విజయ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నారు. అవసరం, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి అవసరమైన వారికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :