Thursday, 30 July 2026 11:53:43 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్య కొండలో కార్తీక పూజకు మంత్రి సతీమణి హరిత

Date : 05 November 2025 11:00 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండ శివాలయం లో జరిగిన కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజకు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈఓ మునిరాజ, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ, ఉత్తమ రెడ్డి, టి.డి.పి నాయకులు సాంప్రదాయబద్ధంగా సన్మానించి ఘనస్వాగతం పలికారు. హరితమ్మ మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో మహిళలతో కలిసి నిరాడంబరంగా కార్తీక పౌర్ణమి నోమును భక్తిశ్రద్ధలతో నోచుకున్నారు. అనంతరం గౌరీ మాత ఆలయం, వీరన్న గెవి, స్వామి వారి పుష్కరిణి, నిచ్చెన కొండ, భగీరథి, వెలుగు మల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లయ్య కొండ మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రజలు ఆ మహాశివుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి, ఆలయ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట,ఆనంద నాయుడు, టిడిపి నాయకులు, మహిళలు, పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :