Sunday, 13 September 2026 03:45:52 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మహిళల ఆర్థిక స్వాలంబన కోసం బ్యాంకులు సహకరించాలి - లీడ్ బ్యాంకు మేనేజర్ జి ఆంజనేయులు.

Date : 11 November 2025 11:35 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 11 ః తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బ్యాంకులు రైతులు, మహిళ సంఘాలు, కక్షిదారులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వాలంబన కోసం సహకరించాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి ఆంజనేయులు సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో త్రైమాసిక ఆర్థిక లావాదేవీల పై బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు మాసాల రైతులు, మహిళా సంఘాలు, ఇతరత్రా రుణాల పంపిణీ, రికవరీలపై ఆరా తీశారు. బ్యాంకు లింకేజీలు, కిసాన్ కార్డులు, పశు కిసాన్ కార్డులు,రబీ క్రాప్ ఇన్సూరెన్స్, సి సి ఆర్ సి, ఉదయం రిజిస్ట్రేషన్, తోబాటు పిఎం ఈజీపి, పి ఎం ఎం వై, పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజిలి యోజన, పీఎం విశ్వకర్మ, ముద్ర హ్యాండ్లూమ్ రుణాలు, పి యం డిడి కే వై మరియు పీఎం స్వనిధి పథకాల రుణాలపై వివరణ అడిగారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి సైబర్ నేరాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వపరంగా అర్హులైన వారికి రుణ పంపిణీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రమణ కుమార్, ఐకెపి ఎపిఎం గంగాధర్, నియోజకవర్గంలోని బ్యాంకు మేనేజర్లు, పశువైద్య జె.వి.ఓ కిరణ్, వ్యవసాయ శాఖ ఏఈఓ సురేష్, సి.సి.లు కత్తి నరసింహులు, రమణ, అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :