నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి - కరాటే ను అభ్యసిస్తే స్వీయ రక్షణ సాధ్యం - ప్రతి ఒక్కరు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత విలేఖరి ) విద్యార్ధినులు ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను అభ్యసించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల ల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణా కార్యక్రమానికి మదనపల్లి శాసన సభ్యులు యం షాజహాన్ బాషా ముఖ్య అతిధిగా హాజరై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మ రక్షణ కార్యక్రమ ప్రారంభోత్స వానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కరాటే మాస్టర్ మనిసాయి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు అహుతులను, విశేషంగా విద్యార్థులను ఆకట్టు కున్నాయి. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే ఆత్మ రక్షణ కోసం కరాటే వ్యక్తిని అభ్యసించాలని సూచించారు. అనుకో కుండా ఎదురయ్యే సంఘటనలను, ఆపదలను, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోన డానికి కరాటే విద్య ఉపయోగ పడు తుందన్నారు.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కరాటే ను అభ్యసించడం ద్వారా స్వియ రక్షణ పొంద వచ్చునన్నారు. స్వర్గీయ కరాటే మాస్టర్ ఏఆర్ సురేష్ ఆశయ స్ఫూర్తితో మని సాయి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ని కరాటే మాస్టర్ మణి సాయి దుశ్యాలువ, గజ మాల తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు కరాటే విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News