Monday, 08 June 2026 09:53:34 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి

Date : 05 November 2025 07:06 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి - కరాటే ను అభ్యసిస్తే స్వీయ రక్షణ సాధ్యం - ప్రతి ఒక్కరు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత విలేఖరి ) విద్యార్ధినులు ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను అభ్యసించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల ల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణా కార్యక్రమానికి మదనపల్లి శాసన సభ్యులు యం షాజహాన్ బాషా ముఖ్య అతిధిగా హాజరై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మ రక్షణ కార్యక్రమ ప్రారంభోత్స వానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కరాటే మాస్టర్ మనిసాయి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు అహుతులను, విశేషంగా విద్యార్థులను ఆకట్టు కున్నాయి. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే ఆత్మ రక్షణ కోసం కరాటే వ్యక్తిని అభ్యసించాలని సూచించారు. అనుకో కుండా ఎదురయ్యే సంఘటనలను, ఆపదలను, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోన డానికి కరాటే విద్య ఉపయోగ పడు తుందన్నారు.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కరాటే ను అభ్యసించడం ద్వారా స్వియ రక్షణ పొంద వచ్చునన్నారు. స్వర్గీయ కరాటే మాస్టర్ ఏఆర్ సురేష్ ఆశయ స్ఫూర్తితో మని సాయి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ని కరాటే మాస్టర్ మణి సాయి దుశ్యాలువ, గజ మాల తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు కరాటే విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :