నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 05 : వాహన చోదకులు మద్యం సేవించి వాహనం నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని తస్మాత్ జాగ్రత్త అని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన క్రాస్ రోడ్ లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చేయరాదన్నారు. వాహనాలు నడిరోడ్డుపై ఉంచి పాదచారులు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వాహన చోదకులు ఒరిజినల్ రికార్డులు దగ్గర ఉంచుకోవాలని రోడ్డు భద్రత సూచనలు కచ్చితంగా పాటించి తీరాలని హెచ్చరించారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్ల చర్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, జమీల్ భాష, రెడ్డప్ప, మునుస్వామి నాయక్, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News