నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : రొంపిచెర్ల - నవంబర్ 10 : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని ఒ.వి.ఆర్.సురేంద్రబాబు కు చెందిన స్విచ్ గేర్ స్ట్రక్చరల్ కంపెని తెలిపింది. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో సోమవారం సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసం క్రీడల పోటీలను నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని అలాంటివారు క్రీడలలో కూడా తమ ప్రతిభను బహిర్గతం చేయడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. రెండు, మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన చెన్నై ఎస్ఆర్ఎం కాలేజి టీమ్, పాండిచ్చేరి, కాకినాడ క్రీడాకారుల జుట్టులకు టోర్నమెంట్ నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
Reporter
Namitha News