Sunday, 13 September 2026 03:45:50 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన ప్రాంతం ను పర్యాటకం గా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతిపత్రం

Date : 17 August 2026 08:12 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 17 : ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె భారత చరిత్రలో ఒక విశిష్ట స్థానం కలిగిన పట్టణం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన "జన గణ మన" జాతీయ గీతాన్ని ఆయన స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి, దానికి స్వరరూపం బాణీ కట్టిచ్చిన చారిత్రక ప్రదేశం ఈ మదనపల్లె. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ అపూర్వ వారసత్వం దేశానికి గర్వకారణం. అయితే, ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ మదనపల్లెకు అయన బస చేసిన ప్రాంతం తగిన స్థాయిలో అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం మరియు జాతీయ గుర్తింపు లభించలేదు. అందువల్ల, మీరు దయచేసి క్రింది అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరిన మదనపల్లి బిజెపి నాయకులు. మదనపల్లె పట్టణం లో ఠాగూర్ గారు బస చేసిన ప్రాంతంను జాతీయ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. జాతీయ గీత చరిత్రను ప్రతిబింబించే స్మారక భవనం, మ్యూజియం మరియు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సంబంధించిన చారిత్రక ప్రాంతాలను సంరక్షించి అభివృద్ధి చేయాలి. రహదారులు, రైల్వే, పర్యాటక వసతులు మరియు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మదనపల్లెకు ఆ ప్రాంతం ని విశేష గుర్తింపు తీసుకురావాలి. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఈ పవిత్ర ప్రాంత అభివృద్ధికి మీ నాయకత్వంలో ప్రత్యేక నిధులు కేటాయించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించిన అన్నమయ్య జిల్లా బీజేపీ కార్యదర్శిబర్నే పల్లె రవికుమార్ , బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, బిజెపి నాయకులు కృష్ణయ్య, వర్మ, పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :