Monday, 14 September 2026 07:47:08 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు పాల్గొన్న విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు

Date : 08 January 2026 09:30 AM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు పాల్గొన్న విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు. ఎస్పీ ధీరజ్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం – ప్రాణరక్షణకు మొదటి అడుగు కార్యక్రమం. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.రెండు చక్రాల వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో అధిక శాతం తల గాయాల వల్లనే జరుగుతున్నాయి. సరైన ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయమైన గాయాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ కార్యక్రమంలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మిస్టర్ అర్షద్ అలీ పిలుపుమేరకు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అది మన జీవిత భద్రతకు సంబంధించిన బాధ్యత. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలపై పడే దెబ్బ తీవ్రత తగ్గి, ప్రాణనష్టం నివారించవచ్చు. ప్రత్యేకంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. డ్రైవర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అందుకే ప్రతి ఒక్కరూ “హెల్మెట్ – నా భద్రత, నా బాధ్యత” అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి, సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి. హెల్మెట్ ధరించండి – మీ కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించండి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :