Thursday, 30 July 2026 12:35:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు పాల్గొన్న విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు

Date : 08 January 2026 09:30 AM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు పాల్గొన్న విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు. ఎస్పీ ధీరజ్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం – ప్రాణరక్షణకు మొదటి అడుగు కార్యక్రమం. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.రెండు చక్రాల వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో అధిక శాతం తల గాయాల వల్లనే జరుగుతున్నాయి. సరైన ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయమైన గాయాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ కార్యక్రమంలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మిస్టర్ అర్షద్ అలీ పిలుపుమేరకు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అది మన జీవిత భద్రతకు సంబంధించిన బాధ్యత. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలపై పడే దెబ్బ తీవ్రత తగ్గి, ప్రాణనష్టం నివారించవచ్చు. ప్రత్యేకంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. డ్రైవర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అందుకే ప్రతి ఒక్కరూ “హెల్మెట్ – నా భద్రత, నా బాధ్యత” అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి, సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి. హెల్మెట్ ధరించండి – మీ కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించండి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :