Thursday, 16 April 2026 08:30:58 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు

Date : 12 December 2025 10:58 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - డిసెంబర్ 12 : చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకురాలు శ్రావణి స్వయంభు శ్రీ వైష్ణవి దేవి, అభయాంజనేయ స్వామి, నాగభైరవ స్వాములకు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టమి ప్రత్యేకతగా నాగభైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించారు. కుజదోషం, సర్పదోషం నివారణకు, వివాహం కాని వారు, సంతానం కోరిక ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న భక్తులు అష్టమి రోజున పంచదీపారాధన చేయడం శ్రేయస్కరమని ఆలయ అర్చకురాలు తెలిపారు. చౌడేపల్లి, పుంగనూరు, మదనపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీకాంత్, ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా సేవలు అందించారు. ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :