నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టు హాల్లో గౌరవ న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్, డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ క్వారీ స్థలం అటవీశాఖ క్వారీ యాజమాన్యం మధ్య వివాదం తో హై కోర్టు లో వాజ్యం నేపథ్యంలో సంబంధిత పత్రాలతో మార్చి 3, 2026న హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణా రాహిత్యంతో, అహంకారపూరితంగా వ్యవహరించడం. అసంపూర్ణ పత్రాల సమర్పణ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కీలకమైన ఉమ్మడి సర్వే నివేదికలోని 3 నుండి 18 పేజీలను జత చేయకపోవడం, దీనివల్ల శాఖకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం. తప్పుదోవ పట్టించే సమాచారం ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చి, శాఖ విశ్వసనీయతను దెబ్బతీయడం. ఉత్తర్వుల ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా అటవీ అధికారి (DFO), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలం లో శ్రీరాములు పుంగనూరు లోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు
Reporter
Namitha News