Wednesday, 29 July 2026 09:14:55 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె లో న్యూ ఇయర్ వేడుకల సంబరాలు

Date : 01 January 2026 09:01 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 01 : తంబళ్లపల్లె మండల కేంద్రం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేలాదిమంది పర్యాటకులతో పర్యాటక కేంద్రాలు జనాలతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వెళ్లి మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని తలమానికంగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు కు పర్యాటకుల పోటెత్తారు. ప్రాజెక్టులో అరాకొరా సౌకర్యాలతో ఎంత సంతోషంగా వచ్చిన పర్యాటకులు నిరాశ చెందారు. ప్రాజెక్టు కింద గల పార్కులు, గెస్ట్ హౌస్ లు, నిధుల లేమితో మరమ్మతులు చేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె శ్రీ కోదండ రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మల్లయ్య కొండకు ఆర్టీసీ వన్ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై టి అనిల్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగడం విశేషం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :