Monday, 14 September 2026 10:58:37 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం

Date : 12 December 2025 08:32 PM Views : 260

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 12 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థుల నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ యన్. ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ కళాశాల స్థాయి నుండి నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకోవడం వెనుక తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మరియు తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకుని, మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు యూనివర్సిటీ యాజమాన్యం అందిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు క్రమశిక్షణ తో కూడిన విద్య ద్వారా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లలో ఉద్యోగఅవకాశాల కోసం యూనివర్సిటీ అధ్యాపకులు నిరంతరం నూతన కోర్సులు నేర్పించి వారి ఉన్నతికి దోహదపడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల భాద్యత వహిస్తూ, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు అవుతున్నారా లేదా అనే విషయాలను తరచూ కళాశాలకు రావడం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. విద్యార్థులు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :