Thursday, 30 July 2026 03:36:26 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వి.బి.జి రామ్ జీ తో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి జాతర - డ్వామా పీడీ వెంకటరత్నం

Date : 08 January 2026 08:12 PM Views : 343

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల కూలీలు, రైతులకు ఉపాధి హామీ ఓ జాతరలా నిలవడం ఖాయమని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంపు, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ మూడు అంశాలే కీలక చట్టంగా నిలిచినట్లు చెప్పారు. ఉపాధి హామీలో కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని అదేవిధంగా రైతులు పొలం పనులు సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులతో పాటు గ్రామాల అభివృద్ధి పనులు, పశుగ్రా స పెంపకం పనులు కల్పించి గ్రామ సీమలు పర్యావరణంతో కళకళ లాడాలని ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :