నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఈ.సి.ఈ. & ఈ.ఈ.ఈ. & సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం పరిశ్రమలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలు, ఆధునిక యంత్రాంగం, నాణ్యత నియంత్రణ పద్ధతులు మరియు భద్రతా ప్రమాణాల గురించి సమగ్ర అవగాహన పొందారు. పరిశ్రమ నిపుణులు ఉత్పత్తి దశలు, ఆటోమేషన్ వినియోగం, ఎలక్ట్రానిక్స్ పాత్ర వంటి అంశాలను వివరంగా తెలియజేసి, నూతన సాంకేతికతలు మరియు భవిష్యత్ అవకాశాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సిద్దాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్ ప్రపంచంతో అనుసంధానించుకునే అవకాశం పొందగా, పరిశ్రమ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు, పరిశీలన సామర్థ్యం మరియు కెరీర్పై అవగాహన మరింత పెరిగింది. ఈ పరిశ్రమ సందర్శనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి అనూష మరియు డాక్టర్ త్రినాథ్ ల అధ్యాపక బృందం మరియు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News