నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 ః తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉదయం 6 గంటలకే గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి సారించడం విశేషం. శుక్రవారం ఎంపీడీవో ఎంవి ప్రసాద్ ఉదయం పంచాయతీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి గ్రీన్ అంబాసిడర్ లను వెంటబెట్టుకుని గ్రామాల్లోని వీధుల్లో ప్రజల నుండి తడి పొడి చెత్తను చెత్త ట్రాలీ లో వేయించడం ఎంపీడీవో గమనించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రతిరోజు చెత్తను కచ్చితంగా చెత్త బండి లో వేసి పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. మండలంలోని కార్యదర్శులు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు చెత్త సేకరణలో ముందుండి ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలని ఎంపీడీవో సూచించారు
Reporter
Namitha News