Monday, 14 September 2026 09:50:24 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో కోటి రూ తో అభివృద్ధి పనులకు శ్రీకారం - పి.ఆర్ ఈ.ఈ. చంద్రశేఖర్ రెడ్డి

Date : 05 March 2026 08:28 PM Views : 464

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 05 ః తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీ లలో సుమారు కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికి నీటి కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పంచాయతీరాజ్ ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, విద్యుత్ సబ్ స్టేషన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, బీసీ కాలనీ, సిద్ధారెడ్డి గారి పల్లి, సాలి వీధుల్లో డిఈ మునిరాజ్, ఏఈ వెంకటరమణ లు సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక ప్రజలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పై ముఖాముఖి చర్చించి వారి సౌకర్యార్థం పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె పంచాయతీలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీ లో డ్వామా పీ.డి వెంకటరత్నం ఆదేశాల మేరకు ప్రాధాన్యత క్రమంలో యుద్ధ ప్రాతిపదికన రూ 42 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శుక్రవారం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తంబళ్లపల్లె తో పాటు పరుసతోపు పంచాయతీలలో సైతం సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు. తంబళ్లపల్లె కు మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. వారి వెంట ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, టిడిపి పార్లమెంట్ రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :