Thursday, 16 April 2026 03:19:37 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లె లో కోటి రూ తో అభివృద్ధి పనులకు శ్రీకారం - పి.ఆర్ ఈ.ఈ. చంద్రశేఖర్ రెడ్డి

Date : 05 March 2026 08:28 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 05 ః తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీ లలో సుమారు కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికి నీటి కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పంచాయతీరాజ్ ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, విద్యుత్ సబ్ స్టేషన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, బీసీ కాలనీ, సిద్ధారెడ్డి గారి పల్లి, సాలి వీధుల్లో డిఈ మునిరాజ్, ఏఈ వెంకటరమణ లు సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక ప్రజలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పై ముఖాముఖి చర్చించి వారి సౌకర్యార్థం పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె పంచాయతీలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీ లో డ్వామా పీ.డి వెంకటరత్నం ఆదేశాల మేరకు ప్రాధాన్యత క్రమంలో యుద్ధ ప్రాతిపదికన రూ 42 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శుక్రవారం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తంబళ్లపల్లె తో పాటు పరుసతోపు పంచాయతీలలో సైతం సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు. తంబళ్లపల్లె కు మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. వారి వెంట ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, టిడిపి పార్లమెంట్ రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :