నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 05 ః తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీ లలో సుమారు కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికి నీటి కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పంచాయతీరాజ్ ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, విద్యుత్ సబ్ స్టేషన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, బీసీ కాలనీ, సిద్ధారెడ్డి గారి పల్లి, సాలి వీధుల్లో డిఈ మునిరాజ్, ఏఈ వెంకటరమణ లు సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక ప్రజలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పై ముఖాముఖి చర్చించి వారి సౌకర్యార్థం పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె పంచాయతీలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీ లో డ్వామా పీ.డి వెంకటరత్నం ఆదేశాల మేరకు ప్రాధాన్యత క్రమంలో యుద్ధ ప్రాతిపదికన రూ 42 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శుక్రవారం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తంబళ్లపల్లె తో పాటు పరుసతోపు పంచాయతీలలో సైతం సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు. తంబళ్లపల్లె కు మంజూరైన అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. వారి వెంట ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, టిడిపి పార్లమెంట్ రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News