Monday, 14 September 2026 08:50:41 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఘనంగా ఫోర్డు సంస్థ 32వ వార్షికోత్సవ సంబరాలు

32సంవత్సరాలు గా నిర్విరామ సేవా కార్యక్రమాలు అందిస్తున్న లలితమ్మ

Date : 25 November 2025 10:40 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 25 : పోర్డ్ సంస్థ ద్వారా 32 ఏళ్లుగా నిర్విరామ సేవా కార్యక్రమాలు - ఘనంగా సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ కు అభినందనలు - శుభాకాంక్షలు తెలిపిన సంస్థ సభ్యులు, పలువురు ప్రముఖులు. మదనపల్లె డివిజన లో 32 సంవత్సరాలుగా సమాజ సేవలో పోర్డ్ సంస్థ సేవలు అందిస్తూ తమదైన గుర్తింపును సొంతం చేసుకుందని మంగళవారం సంస్థ కార్యాలయం నందు డైరెక్టర్ జల్లా లలితమ్మ ను అభినదించారు. సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టరు. సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ మాట్లాడుతూ పోర్డ్ సంస్థ సిబ్బంది,దాతలు,అధికారులు సహాయ,సహకారాలతో లక్ష్యాలు చేరుకొని,పురోభివృద్ధి సాదిస్తున్నామన్నారు. గడచిన 32 సంవత్సరాల నుండి దళితులు ఆదివాసీల హక్కులు,అభివృద్ధి,మహిళల ఆర్థిక స్వావలంబన,మహిళల్లో చైతన్యం తీసుకురావటం,బాల కార్మికుల నిర్మూలన,బాల్య వివాహాల నిర్మూలన,నిర్బంధ విద్యాహక్కుచట్టం అమలుతో పాటు అనేక కార్యక్రమాలపై పోర్డ్ సంస్థ ముందుకు సాగుతోందని వివరించారు. ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటంతో పాటు కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే అది పిల్లల విద్యాభ్యాసంతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లో గట్టిగా వినిపించి అవగాహన కల్పించడం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆధునిక పోకడలతో ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు,వ్యవసాయంలో పెరిగిపోతున్న క్రిమిసంహారక మందుల వినియోగం,ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం,తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతాంగంలో చైతన్యాన్ని తీసుకువచ్చి అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ అంశాలపై పోర్టు సంస్థ మున్ముందు కూడా తమ ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతుందన్నారు.అలాగే తనను అభిందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్టు సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిర్మల,కో-ఆర్డినేటర్ సుభాషిణి,మండల కో-ఆర్డినేటర్లు ఎ.నరసింహులు, ఎం.నరసింహులు, సంస్థ కోశాధికారి హేమంత్ కుమార్,సిబ్బంది అల్తాప్,జయలక్ష్మి,జలజాక్షి,స్వర్ణ,భువనేశ్వరి,అనిత,రెడ్డమ్మ, శైలజ,రమణ,శివన్నలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: