Monday, 14 September 2026 07:42:35 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి లో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్ 2కె26

ఆకట్టుకొన్న సినీ ప్రముఖుల ఆట పాటలు

Date : 26 March 2026 08:48 PM Views : 298

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. రెండవ రోజు కార్యక్రమాన్ని యూనివర్సిటీ నందు సినీ హీరో శర్వానంద్ మరియు హీరోయిన్ మాళవిక నాయర్ లు విద్యార్థులను అలరించారు. విద్యార్థులతో తన సాంగ్స్ తో అలరించారు. కార్యక్రమం లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ లో అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి ఒక్కరికి ఓపికా, సహనం చాలా అవసరం అన్నారు. విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పైకి రావడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి అధ్యయనం, అబ్యాసం, శిక్షణ, పరిశోధన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు తమ లక్షాలను సాధించడానికి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరిగా లక్ష్యం సాధించాలని ఆయన అన్నారు. డాన్స్ తో విద్యార్థులను అలరించారు. ప్రతి ఒక్కరికి విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని, ఈ విద్యార్ధి దశను మనం ఆస్వాదించాలని, మనకు మల్లా కావాలన్నా రానిది విద్యార్ధి దశ అని అన్నారు. కావున ఆనందంగా విద్యార్ధి దశ ను ఎంజాయ్ చేయండి అని విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం మెంబెర్స్ సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్, నవ సందీప్, జబర్దస్త్ పులి వంటి ప్రముఖ కళాకారులు తమ వినోద ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి హాస్య విన్యాసాలు, స్టేజ్ ప్రదర్శనలు విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ళ ద్వారకనాథ్ , వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :