Thursday, 30 July 2026 10:49:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి లో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్ 2కె26

ఆకట్టుకొన్న సినీ ప్రముఖుల ఆట పాటలు

Date : 26 March 2026 08:48 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. రెండవ రోజు కార్యక్రమాన్ని యూనివర్సిటీ నందు సినీ హీరో శర్వానంద్ మరియు హీరోయిన్ మాళవిక నాయర్ లు విద్యార్థులను అలరించారు. విద్యార్థులతో తన సాంగ్స్ తో అలరించారు. కార్యక్రమం లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ లో అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి ఒక్కరికి ఓపికా, సహనం చాలా అవసరం అన్నారు. విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పైకి రావడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి అధ్యయనం, అబ్యాసం, శిక్షణ, పరిశోధన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు తమ లక్షాలను సాధించడానికి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరిగా లక్ష్యం సాధించాలని ఆయన అన్నారు. డాన్స్ తో విద్యార్థులను అలరించారు. ప్రతి ఒక్కరికి విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని, ఈ విద్యార్ధి దశను మనం ఆస్వాదించాలని, మనకు మల్లా కావాలన్నా రానిది విద్యార్ధి దశ అని అన్నారు. కావున ఆనందంగా విద్యార్ధి దశ ను ఎంజాయ్ చేయండి అని విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం మెంబెర్స్ సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్, నవ సందీప్, జబర్దస్త్ పులి వంటి ప్రముఖ కళాకారులు తమ వినోద ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి హాస్య విన్యాసాలు, స్టేజ్ ప్రదర్శనలు విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ళ ద్వారకనాథ్ , వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: