నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. రెండవ రోజు కార్యక్రమాన్ని యూనివర్సిటీ నందు సినీ హీరో శర్వానంద్ మరియు హీరోయిన్ మాళవిక నాయర్ లు విద్యార్థులను అలరించారు. విద్యార్థులతో తన సాంగ్స్ తో అలరించారు. కార్యక్రమం లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ లో అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి ఒక్కరికి ఓపికా, సహనం చాలా అవసరం అన్నారు. విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పైకి రావడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి అధ్యయనం, అబ్యాసం, శిక్షణ, పరిశోధన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు తమ లక్షాలను సాధించడానికి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరిగా లక్ష్యం సాధించాలని ఆయన అన్నారు. డాన్స్ తో విద్యార్థులను అలరించారు. ప్రతి ఒక్కరికి విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని, ఈ విద్యార్ధి దశను మనం ఆస్వాదించాలని, మనకు మల్లా కావాలన్నా రానిది విద్యార్ధి దశ అని అన్నారు. కావున ఆనందంగా విద్యార్ధి దశ ను ఎంజాయ్ చేయండి అని విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం మెంబెర్స్ సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్, నవ సందీప్, జబర్దస్త్ పులి వంటి ప్రముఖ కళాకారులు తమ వినోద ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి హాస్య విన్యాసాలు, స్టేజ్ ప్రదర్శనలు విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ళ ద్వారకనాథ్ , వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి
Reporter
Namitha News