నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 ః వాహన చోదకులు రికార్డులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ టి.అనిల్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కురువపల్లి క్రాస్ రోడ్ లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రికార్డులతోపాటు కచ్చితంగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి బండి నడపరాదని, అతివేగం చేయరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ఆటోలలో పరిమితికి మించి ప్యాసింజర్ లను ఎక్కించరాదని రోడ్డు భద్రత నియమాలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి యాక్సిడెంట్లకు గురికాకుండా క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకొని తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని సూచించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, వాహన చోదకులు పాల్గొన్నారు
Reporter
Namitha News