నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : తంబళ్లపల్లె మండలంలో మంగళవారం జేఎస్ జేపీ సెంట్రల్ టీం మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ లో జరిగిన ఉపాధి హామీ కరువు పనులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఉదయం సెంట్రల్ టీం నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కొటాల, గోపి దీన్నే, తంబళ్లపల్లె, పంచాలమర్రి, రేణుమాకులపల్లి పంచాయతీలలో సెంట్రల్ టీం ఎంపిక చేసిన 8 ఉపాధి హామీ కరువు పనులు ఫారంపాండ్లు, చెక్ డ్యాములు, జల శక్తి అభియాన్ అక్షాంశాలు, రేఖాంశాలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరిగిన 33 వేల ఉపాధి హామీ కరువు పనులలో ఒక్క శాతం 331 పనులను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జరిగిన పనులలో అక్షాంశాలు, రేఖాంశాలు, నాణ్యత లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్దమండెం, తంబళ్లపల్లె మండలాలలో క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించామని తెలిపారు. తంబళ్లపల్లెలో జరిగిన ఉపాధి హామీ పనులు నాణ్యత తో పాటు భవిష్యత్తులో నీటి సంరక్షణ కు ఉపయోగకరంగా ఉండడం హర్షనీయమన్నారు. ఆయన వెంట జిల్లా జిఏఎస్ నాగరాజు, ఈసీ మహేష్ బాబు, క్లస్టర్ టి ఏ బావాజీ, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, భూదేవి, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, నాయక్, వేమ నారాయణ, తదితరులు ఉన్నారు
Reporter
Namitha News