Tuesday, 15 September 2026 09:48:10 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

రైతాంగానికి బడ్జెట్ నందు ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం : సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప

తహసీల్దార్ బాబ్ జాన్ కు వినతిపత్రం సమర్పించిన సీపీఐ నాయకులు

Date : 23 February 2026 08:44 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఫిబ్రవరి 23 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ఫిబ్రవరి 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ నందు రైతాంగానికి ప్రాధాన్యత నివ్వకుండా, ముఖ్యంగా కౌలు రైతులకు తీవ్ర నిరాశకు గురిచేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా, సిపిఐ,రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం బి.కొత్తకోట మండల కార్యాలయం ముందర నిరసన తెలిపి,తహాసిల్దార్ బావా జన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.క్రిష్ణప్ప,నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ; మొత్తం రూ॥ 3.33 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ రంగాలకు కేవలం రూ॥ 53,752 కోట్లు మాత్రమే కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ' పథకానికి గతంలో రూ॥ 9,400 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ॥ 6,660 కోట్లకు తగ్గించారని,రాష్ట్రంలో మెజారిటీ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. వడ్డీ రాయితీకి రూ॥ 2,000 కోట్లు అవసరమైతే కేవలం రూ॥ 250 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ॥ 3,000 కోట్లు అవసరమైతే కేవలం రూ॥500 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన చెందారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి నిధులు సున్నాగా వుండటం వల్ల రైతులు అభద్రతకు గురవుతున్నారని,పశుసంవర్ధక,మత్స్య,ఆక్వా, సెరికల్చర్ వంటి ఉపాధినిచ్చే రంగాలకు ఆశించిన ప్రాధాన్యత లభించలేదనన్నారు.రాష్ట్ర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 50%, వ్యవసాయరంగానికే ప్రత్యేకంగా కనీసం 10% నిధులను కేటాయించాలని,గత మరియు ప్రస్తుత సంవత్సర అన్నదాత సుఖీభవ పథకం బకాయిలు సుసుమారు రూ॥27,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని,భూమి లేని కౌలు రైతులకు రావాల్సిన సుమారు రూ॥ 3,500 కోట్ల బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని,ఎన్నికల వాగ్దానం మేరకు నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని,ధరల స్థిరీకరణకు రూ॥ 3,000 కోట్లు,వడ్డీ రాయితీకి రూ॥ 2,000 కోట్లు మరియు ఉచిత పంట బీమాకు రూ|| 2,000 కోట్లు కేటాయించాలని,మైనర్ ఇరిగేషన్ పనులకు కనీసం రూ॥ 5,000 కోట్లు కేటాయించాలని,రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు నిధులుకేటాయించాలని,ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించి వారిని ఆదుకోవాలని,కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి నిధులు పెంచేలా ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం మండల నాయకులు పి. నారాయణస్వామి, గంగన్న,శంకర, నరసింహులు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :