నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 27 : మదనపల్లె పట్టణం లోని ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణ నగర్ లో ఏర్పాటు చేసిన షీఫా వి.కేర్ IVF సెంటర్, ఫెర్టిలిటీ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు . ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నూతన ఆసుపత్రిని డాక్టర్ కలీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఆధునిక వైద్య సేవలు, నాణ్యమైన చికిత్సలు ప్రజలకు అందుబాటులోకి రావడం మదనపల్లె ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోదని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, చందు బీజేపీ యువ నాయకులు బండి దామోదర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News