నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 : తంబళ్లపల్లె మండలం లో పారిశుద్ధ్యం కార్యక్రమాల నిర్వహణ తో పాటు ఐ.వి.ఆర్. అవగాహన లో మండలానికి అవార్డు లభించింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ వి ఆర్ కృష్ణ తేజ చేతుల మీదుగా తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్ అవార్డు అందుకున్నారు. తంబళ్లపల్లెకు అవార్డు రావడానికి స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి స్ఫూర్తితో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు,డిప్యూటీ ఎంపీడీవో లు వెంకటేశ్వర ప్రసాద్, మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప మండల స్థాయి అధికారుల ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ సిబ్బంది కృషి ఫలితమే. అవార్డు రావడం పై స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అవార్డు రావడం హర్షనీయమని భవిష్యత్తులో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం స్వచ్ఛ-ఆంధ్ర, స్వచ్ఛ- దివస్ కార్యక్రమాలతో పారిశుద్ధ్యం మెరుగు, తడి, పొడి చెత్తతో ఎరువు తయారీ, ప్లాస్టిక్ నివారణకు సమిష్టి కృషి చేయాలని కోరారు.
Reporter
Namitha News