Wednesday, 29 July 2026 04:57:36 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం

Date : 19 April 2026 06:17 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. కబడ్డీ క్రీడా పోటీలను అన్నమయ్య జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ బాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, రన్ టీవీ డైరెక్టర్ సిరివేలు చరణ్ కుమార్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, కబడ్డీ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలలో జిల్లా నలుమూలల నుండి అండర్ 14, 17, 19 విభాగాలలో బాలబాలికల క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని ప్రతిభ చూపారు. అండర్ 14 విభాగంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, అండర్ 17 విభాగంలో కలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అండర్ 19 విభాగంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాటకొండ గురు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి చురుగ్గా క్రీడల్లో పాల్గొంటారని, ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్ పోటీలలో కబడ్డీ క్రీడను కూడా చేర్చాలని, అందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి క్రీడాకారులు పాల్గొనేలా శిక్షణ తీసుకోవాలని తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడాకారుల బహుమతులను జివీఎస్సిఎస్ సొసైటీ ఫౌండర్ జి.శ్రీధర్ కుమార్ సమకూర్చారని అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు శ్రీకాంత్, రమేష్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ మిమిక్రీ రామమూర్తి, క్రీడాభారతి మదనపల్లె శాఖ అధ్యక్షులు బాలాజీ, షూటింగ్ బాల ఆసియన్ గోల్డ్ మెడలిస్ట్ యూసఫ్ బాషా, క్రీడా భారతి సభ్యులు మురళి, కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ, లత, భారతి, శరత్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :