నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. కబడ్డీ క్రీడా పోటీలను అన్నమయ్య జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ బాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, రన్ టీవీ డైరెక్టర్ సిరివేలు చరణ్ కుమార్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, కబడ్డీ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలలో జిల్లా నలుమూలల నుండి అండర్ 14, 17, 19 విభాగాలలో బాలబాలికల క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని ప్రతిభ చూపారు. అండర్ 14 విభాగంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, అండర్ 17 విభాగంలో కలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అండర్ 19 విభాగంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాటకొండ గురు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి చురుగ్గా క్రీడల్లో పాల్గొంటారని, ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్ పోటీలలో కబడ్డీ క్రీడను కూడా చేర్చాలని, అందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి క్రీడాకారులు పాల్గొనేలా శిక్షణ తీసుకోవాలని తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడాకారుల బహుమతులను జివీఎస్సిఎస్ సొసైటీ ఫౌండర్ జి.శ్రీధర్ కుమార్ సమకూర్చారని అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు శ్రీకాంత్, రమేష్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ మిమిక్రీ రామమూర్తి, క్రీడాభారతి మదనపల్లె శాఖ అధ్యక్షులు బాలాజీ, షూటింగ్ బాల ఆసియన్ గోల్డ్ మెడలిస్ట్ యూసఫ్ బాషా, క్రీడా భారతి సభ్యులు మురళి, కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ, లత, భారతి, శరత్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News