నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 05 : రామసముద్రం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్, ఎం ఈవో హేమలత, ఆంజనేయులు, హెచ్ ఎం లు, మునిస్వామి నాయక్,చిట్టిబాబు, హేమలత, వెంకటరమణ నాయుడు, కె. రమేష్ బాబు, వెంకటచలపతిరాజు, మెడికల్ ఆఫీసర్ జాహ్నవి,పాఠశాల కమిటీ చైర్మన్ లు కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు, వీరికి ఘన స్వాగతం పలికారు. స్వాగతకార్యక్రమంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ రోజు విద్యార్థులే రేపటి భవిష్యత్తు మీరు బాగా చదివితే డాక్టర్, ఇంజనీర్, టీచర్, పోలీస్ లు వంటి ప్రతిష్టాత్మక స్థానాలు సంపాదించి మీ తల్లి దండ్రులు, గురువులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలాన్నారు. కూటమి ప్రభుత్వ రాకతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా& ఐటీ శాఖామంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజాహాన్ బాషా ఆలోచనా విధానంతో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతుందని కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తూ పిల్లల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిందన్నారు. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు సలహాలతో వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని కూటమి ప్రభుత్వం పాఠశాలవిద్యార్ధులకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టివారి తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తుందన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు.ఈకార్యక్రమాల్లో పాల్గొన్నా సీతారామస్వామి, పెద్దిరెడ్డి,స్థానికం రాజేష్, శివశంకర,రెడ్డెప్పరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బి. నారాయణ, మట్లవారిపల్లె కిట్ట, బాలాజీ, నాగరాజు, శ్రీనివాసులు, సుబ్బు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News