నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జులై 03 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఈఏపీసెట్ (EAPCET) ద్వారా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నామని, వారి ర్యాంకుకు అనుగుణంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే సువర్ణ అవకాశాన్ని మిట్స్ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి యూనివర్సిటీలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) లు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక పాఠ్య ప్రణాళిక, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు, పరిశోధనకు ప్రాధాన్యత మరియు అత్యుత్తమ ప్లేస్మెంట్ సదుపాయాలతో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తోందని డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఈఏపీసెట్ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీని నేరుగా సందర్శించి కోర్సులు, ఫీజు రాయితీలు మరియు ప్రవేశాల వివరాలను తెలుసుకొని వెంటనే అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రో ఛాన్సలర్ శ్రీ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ (ఇన్చార్జ్) డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ (ఇన్చార్జ్) డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు
Reporter
Namitha News