Wednesday, 29 July 2026 12:27:45 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వ్యాఖ్య

Date : 17 May 2026 05:50 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వ్యాఖ్య మదనపల్లె మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ మదనపల్లె మండల కార్యదర్శి కొత్తపల్లి మహేశ్ ఆహ్వానం మేరకు ఆయన స్వగృహంలో నిర్వహించిన శుభకార్యక్రమానికి తంబళ్లపల్లె గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి ఎస్ నిసార్ అహమద్ ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జన్నె శేషాచలపతి నాయుడు, మల్లికార్జున, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అనౌపచారిక సమావేశంలో నాయకులు పార్టీ పరిస్థితులు, గ్రామస్థాయి రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, గ్రామ స్థాయి కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మదనపల్లె నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఐక్యంగా నడిపిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఎస్ నిసార్ అహమద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను కొత్తపల్లి మహేశ్, కుటుంబ సభ్యులు ఆత్మీయంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: