Monday, 08 June 2026 08:20:03 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వ్యాఖ్య

Date : 17 May 2026 05:50 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వ్యాఖ్య మదనపల్లె మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ మదనపల్లె మండల కార్యదర్శి కొత్తపల్లి మహేశ్ ఆహ్వానం మేరకు ఆయన స్వగృహంలో నిర్వహించిన శుభకార్యక్రమానికి తంబళ్లపల్లె గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి ఎస్ నిసార్ అహమద్ ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జన్నె శేషాచలపతి నాయుడు, మల్లికార్జున, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అనౌపచారిక సమావేశంలో నాయకులు పార్టీ పరిస్థితులు, గ్రామస్థాయి రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, గ్రామ స్థాయి కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మదనపల్లె నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఐక్యంగా నడిపిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఎస్ నిసార్ అహమద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను కొత్తపల్లి మహేశ్, కుటుంబ సభ్యులు ఆత్మీయంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :