నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : * నెట్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ బాల, బాలికలు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం డాన్ బాస్కో స్కూల్ నందు 15/03/2026 తేదీలో జరిగినటువంటి నెట్ బాల్ అండర్ 19 మెన్ & ఉమెన్ అసోసియేషన్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి బాలికల విభాగం నందు విశ్వం స్కూల్ సీ.బీ.ఎస్.ఈ. మదనపల్లికి సంబంధించిన ఎల్.ప్రహలక్ష్మి, టి.సాయా రంజిత్, యం.ఐశ్వర్య మరియు బాలుర విభాగం నందు యం.రవి, యస్.ఖాసీమ్ జాతీయస్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది 24/03/2026 నుండి 28/03/2026 తేదీలలో ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తున్నటువంటి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది జాతీయస్థాయికి ఎంపికైన ఈ బాలికను విశ్వం విద్యాసంస్థల అధినేత ఎం. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు.విశ్వం పాఠశాల ప్రిన్సిపల్ జే. రోజ్లిన్ ప్రియ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ జీవన్ గారు ఎంపికైన బాల,బాలికలను విజయం సాధించాలని ప్రోత్సాహం అందిస్తూ అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిఈటి బృందాన్ని కూడా అభినందించడం జరిగింది
Reporter
Namitha News