నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : నిరక్షరాస్యులుయిన వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం మని తెలుపుతున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. సోమవారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో వయోజన విద్య శాఖ వారి చే "ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం"కు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విడుదల చేశారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా మార్చడమనన్నారు. ఈ పథకం ద్వారా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించ బడుతుందని తెలిపారు. అక్షరాస్యత తో పాటు వారికి ఆర్థిక అక్షరాస్యత,డిజిటల్ అక్షరాస్యత,వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ,కుటుంబ సంక్షేమం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉపాధ్యాయులు (వాలంటీర్లు) ద్వారా తరగతులునిర్వహిస్తున్నారని సర్వేలు నిర్వహించడానికి మరియు అభ్యాసకులు, వాలంటీర్లను నమోదు చేయడానికి ఉల్లాస్ మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు.జిల్లా మరియు మండల స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారని, అక్షర ఆంధ్ర వాచకాలు అభ్యాసకులకు పంపిణీ చేస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా వయోజనులను అక్షరాస్యులు గా చేసి,వారిని సమాజంలో చైతన్య వంతులు గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వయోజన విద్య డి.డి. వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News