Sunday, 13 September 2026 03:52:15 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

నిరక్షరాస్యులయిన వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్-అక్షర ఆంధ్ర కార్యక్రమ లక్ష్యం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 February 2026 08:07 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : నిరక్షరాస్యులుయిన వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం మని తెలుపుతున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. సోమవారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో వయోజన విద్య శాఖ వారి చే "ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం"కు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విడుదల చేశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా మార్చడమనన్నారు. ఈ పథకం ద్వారా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించ బడుతుందని తెలిపారు. అక్షరాస్యత తో పాటు వారికి ఆర్థిక అక్షరాస్యత,డిజిటల్ అక్షరాస్యత,వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ,కుటుంబ సంక్షేమం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉపాధ్యాయులు (వాలంటీర్లు) ద్వారా తరగతులునిర్వహిస్తున్నారని సర్వేలు నిర్వహించడానికి మరియు అభ్యాసకులు, వాలంటీర్లను నమోదు చేయడానికి ఉల్లాస్ మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు.జిల్లా మరియు మండల స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారని, అక్షర ఆంధ్ర వాచకాలు అభ్యాసకులకు పంపిణీ చేస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా వయోజనులను అక్షరాస్యులు గా చేసి,వారిని సమాజంలో చైతన్య వంతులు గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వయోజన విద్య డి.డి. వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :