నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 09 : తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములను ప్రభుత్వ అధికారులు బలవంతంగా సేకరించే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న సీపీఐ నాయకులు. సోమవారం పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాలను ఇవ్వడానికి అంగీకరించకపోయినా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులు ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. రైతుల జీవనాధారం భూమి. వారి సమ్మతి లేకుండా భూములు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అభిప్రాయాలు తీసుకోవడం, గ్రామ సభ నిర్వహించడం, సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించడం తప్పనిసరి. కానీ కుక్కరాజుపల్లి గ్రామంలో ఈ నిబంధనలు పాటించకుండా భూసేకరణకు ప్రయత్నించడం రైతుల హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించని పరిస్థితిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. రైతుల అభిప్రాయాలను గౌరవించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు
Admin
Namitha News