నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం -- పోలీసులకు ఫిర్యాదు అభం, శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె మండలం లో జరిగింది. బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మదనపల్లె మండలం, వలసపల్లె పంచాయతీ, కట్లాటపల్లి కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు. అవ్వ చెంతనే ఉంటోంది. అవ్వే కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివించుకుంటోంది. ఈ క్రమంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి ని స్థానికంగా ఉన్న వరుణ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, నోటికి గుడ్డకుక్కి అత్యాచారం యత్నం చేస్తుండగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కూలుపనుల్లో ఉన్న అవ్వకు విషయం తెలియగానే పరుగుపరుగున ఇంటికి చేరుకుంది. చిన్నారి అవ్వ వెంటనే గ్రామస్తులతో కలిసి మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు లేని చిన్నారిపై అఘత్యానికి పాల్పడిన యువకున్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విచారించి నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేస్తామని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సీఐ కు ఫిర్యాదు చేస్తున్న కాట్లాటపల్లి గ్రామస్థులు
Reporter
Namitha News