Wednesday, 29 July 2026 12:31:31 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అపస్ మండల అధ్యక్షుడు గా జె. హరనాథ్

ఏకగ్రీవంగా ఎపియూఎస్ మండల కమిటీ ఎన్నికలు

Date : 28 January 2026 01:04 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 28 : రామసముద్రం మండల ఎపియూఎస్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఎపియూఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక కొరకు ఏర్పాటు ఆపస్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆపస్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని అంతే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులలో దేశభక్తి, జాతీయ భావాలు నింపి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల అధికారినిగా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ రెడ్డి రాజేశ్వరి, వ్యవహరించారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి ( IR) 30 శాతం ప్రకటించాలని,ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి 10వ తరగతి స్పాట్ వేల్యూషన్ డ్యూటీ నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండలం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు గా జె.హరినాథ్ (స్కూల్ అసిస్టెంట్,హిందీ, మట్లవారిపల్లి ) మండల ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకటరమణ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ , ఆర్థిక కార్యదర్శిగా పి. అశోక్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ , ఉపాధ్యక్షులుగా పి.రవీంద్ర స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, మహిళా కార్యదర్శిగా టి.వాణి పిజిటి ఆదర్శ పాఠశాల వారిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఆపస్ సంఘాన్ని బలోపేతం చేస్తామని, మండలంలోని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఆపస్ నాయకులు సందీప్, కళ్యాణ్ చక్రవర్తి, సిద్ధారెడ్డి, భార్గవి, రవీంద్ర,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :