నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 28 : రామసముద్రం మండల ఎపియూఎస్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఎపియూఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక కొరకు ఏర్పాటు ఆపస్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆపస్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని అంతే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులలో దేశభక్తి, జాతీయ భావాలు నింపి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల అధికారినిగా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ రెడ్డి రాజేశ్వరి, వ్యవహరించారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి ( IR) 30 శాతం ప్రకటించాలని,ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి 10వ తరగతి స్పాట్ వేల్యూషన్ డ్యూటీ నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండలం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు గా జె.హరినాథ్ (స్కూల్ అసిస్టెంట్,హిందీ, మట్లవారిపల్లి ) మండల ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకటరమణ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ , ఆర్థిక కార్యదర్శిగా పి. అశోక్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ , ఉపాధ్యక్షులుగా పి.రవీంద్ర స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, మహిళా కార్యదర్శిగా టి.వాణి పిజిటి ఆదర్శ పాఠశాల వారిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఆపస్ సంఘాన్ని బలోపేతం చేస్తామని, మండలంలోని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఆపస్ నాయకులు సందీప్, కళ్యాణ్ చక్రవర్తి, సిద్ధారెడ్డి, భార్గవి, రవీంద్ర,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News